BREAKING: టీడీపీ, వైసీపీ మధ్య చిచ్చుపెట్టిన వృద్ధురాలి మృతి.!

by Disha Web Desk 9 |
BREAKING: టీడీపీ, వైసీపీ మధ్య చిచ్చుపెట్టిన వృద్ధురాలి మృతి.!
X

దిశ, వెబ్‌‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ వివాదం ఏపీ పాలిటిక్స్ ‌ను కుదిపేస్తుంది. ఉదయం నుంచి లబ్దిదారులు సచివాలయాల పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. సచివాలయ సిబ్బంది రేపు ఇస్తాం.. మాపు ఇస్తాం వెళ్లండంటూ.. అవస్థలు పడుకుంటూ ఇళ్ల నుంచి వచ్చిన వృద్ధులను, వికలాంగులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా పింఛన్ కోసమని వెళ్లిన వజ్రమ్మ (80) అనే ఓ వృద్ధురాలు ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కృష్ణ జిల్లా గంగూలురులో చోటుచేసుకుంది. అయితే వజ్రమ్మ మరణానికి ముఖ్యకారణం చంద్రబాబే కారణమంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వజ్రమ్మ మరణం కారణంగా టీడీపి-వైసీపీ పార్టీ మధ్య వైరం నడుస్తోంది.

Next Story

Most Viewed